
తమిళనాడులోని వాణియంబాడిలో పుట్టిన విద్యాశిఖరం డాక్టర్ ఎం.ఆనంతకృష్ణన్. విద్యాభ్యాసాన్ని తమిళంలోనే పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే గణితం పట్ల ఎంతో ఆసక్తిని కనబరచిన ఈయన రోడ్ల నిర్మాణ రంగంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అన్నా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ కాన్పూర్లోను, అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఓ సంస్థ సైన్స్ విభాగంలో పనిచేశారు. గతంలో తమిళనాడు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారునిగా కూడా సేవలందించారు. విద్యాభివృద్ధి లక్ష్యంగా ఏఐసీటీఈ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా పనిచేసిన ఆనంతకృష్ణన్ చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఛైర్మన్గా బాధ్యతలను నిర్వహించారు. 77 ఏళ్ల ప్రాయంలోను 25 ఏళ్ల యువకునిలా పని చేస్తున్న ఆయనను మన భాషా ఇండియా కోసం కలుసుకున్నప్పుడు...